వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇంటిని ముట్టడించిన కాకతీయ విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revuri Prakash Reddy
వరంగల్: తెలంగాణ అంశంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని పంపించవద్దని వారు ఆయనను డిమాండ్ చేశారు. ఒక్కో పార్టీనుండి ఇద్దరిని పిలవడం ద్వారా అఖిలపక్షంలో ఫలితం తేలదని వారు స్పష్టం చేశారు.

ప్రజాభిప్రాయం మేరకే నడుచుకుంటామని రేవూరి విద్యార్థులకు నచ్చజెప్పారు. తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. కాగా అంతకుముందు విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షానికి ఓక్కో పార్టీనుండి ఒక్కరినే పిలవాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X