వైయస్ జగన్ అనుచరుల ఇళ్లపై పోలీసు దాడులు
కృష్ణ, శివశంకర్ రెడ్డిల వద్ద లైసెన్స్ తుపాకులు ఉన్నాయని వాటి రెన్యువల్ గురించి చర్చించేందుకు వారి ఇళ్లకు వెళ్లినట్లు పులివెందుల డిఎస్పీ నరసింహా రావు తెలిపారు. కాగా జగన్ అనుచరులు డి.కృష్ణ, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలు మాట్లాడుతూ జరగబోయే ఉప ఎన్నికల్లో జగన్ హవాను ఎదుర్కోలేక జిల్లాలోని మంత్రుల పిరికిపంద చర్యల్లో భాగంగా తమ ఇళ్లపై పోలీసులతో దాడులు చేయించారన్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు కాదు 30 మంది మంత్రులను నియమించినా జగన్ను అడ్డుకోలేరన్నారు.
Comments
Story first published: Monday, January 3, 2011, 8:40 [IST]