కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ అనుచరుల ఇళ్లపై పోలీసు దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప జిల్లా పులివెందులలో కడప మాజీ ఎంపీ వైయస్ జగన్ అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. యువజన కాంగ్రెసు మాజీ నాయకుడు డి.కృష్ణ, డిసీఎంఎస్ ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఇళ్లపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. తుపాకుల లైసెన్స్ రెన్యువల్స్‌కు వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని తనిఖీ చేయవచ్చు. కానీ వారి ఇళ్లపై దాడులు చేయడంతో పట్టణంలో పెద్ద చర్చనీయాంశమైంది.

కృష్ణ, శివశంకర్ ‌రెడ్డిల వద్ద లైసెన్స్ తుపాకులు ఉన్నాయని వాటి రెన్యువల్ గురించి చర్చించేందుకు వారి ఇళ్లకు వెళ్లినట్లు పులివెందుల డిఎస్పీ నరసింహా రావు తెలిపారు. కాగా జగన్ అనుచరులు డి.కృష్ణ, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు మాట్లాడుతూ జరగబోయే ఉప ఎన్నికల్లో జగన్ హవాను ఎదుర్కోలేక జిల్లాలోని మంత్రుల పిరికిపంద చర్యల్లో భాగంగా తమ ఇళ్లపై పోలీసులతో దాడులు చేయించారన్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు కాదు 30 మంది మంత్రులను నియమించినా జగన్‌ను అడ్డుకోలేరన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X