వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ వాదనను కొట్టేసిన చిదంబరం, ఆ వాదన అర్థరహితం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై చర్చించడానికి ఒక్కో పార్టీనుండి ఇద్దరిని పిలిచినప్పటికీ ఆయా పార్టీలు ఒక్కరిని కూడా పంపుకోవచ్చునని కేంద్ర హోంమంత్రి చిదంబరం మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఒక్కో పార్టీనుండి ఇద్దరిని పంపించడం వల్ల భిన్నాభిప్రాయాలు చెప్పే అవకాశముందని, అందుకే దానిని తాము బహిష్కరిస్తున్నట్లు చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అన్న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఇష్టం లేని వారు ఒక్కరినే పంపించుకోవచ్చునని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ వంటి పార్టీలనుండి వచ్చే ఇద్దరు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని అలాగే మిగిలిన పార్టీలు వ్యక్తం చేసుకోవచ్చునన్నారు. కానీ అఖిలపక్షాన్ని బహిష్కరించడం సరికాదన్నారు. ఇష్టంలేని వారు ఒకే ప్రతినిధిని పంపవచ్చని చెప్పారు. గతంలో పిలిచినట్టుగానే ఇప్పుడు పిలిచామని చెప్పారు.

అయినా ఇద్దరు ప్రతినిధులను రెండు అభిప్రాయాలు చెప్పమని చెప్పలేదన్నారు. అయితే మంత్లీ రిపోర్టు చెబుతున్న సమయంలో విలేకరులు తెలంగాణ, కెసిఆర్ అంశాన్ని ప్రస్తావించగా దానికి మరో ప్రెస్ మీట్ ఉంటుందని అది ఇప్పుడు కాదని చెప్పారు. అయితే విలేకరులు ప్రశ్నలు కురిపించే సరికి ఆయన ముక్తసరిగా సమాధానాలు చెప్పారు. అఖిల పక్షానికి అన్ని పార్టీలు వస్తాయని ఆయన ఆశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X