హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎఫెక్ట్: చిదంబరం అఖిలపక్షానికి చిరంజీవి డుమ్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తెలంగాణ అంశంపై న్యూఢిల్లీలో హోంమంత్రి చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో పార్టీనుండి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6న జరిగే అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని ఒక్కో పార్టీనుండి ఇద్దరిని చిదంబరం అహ్వానించారు. ఈ సమావేశానికి ముందుగా చిరంజీవి, సి.రామచంద్రయ్య వెళుతున్నట్లు ప్రకటించారు.

అయితే అనూహ్యంగా చిరంజీవి భేటీకి వెళ్లవద్దని నిర్ణయించుకోవటంతో ఆయన స్థానంలో కోటగిరి వెళ్లనున్నారు. త్వరలో చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చిరంజీవి చెబుతున్నప్పటికీ శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామని చిరంజీవి చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతం వారంతా భేటీని బహిష్కరించాలని డిమాండ్ అన్ని పార్టీలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తన తెలంగాణ పర్యటన ఉద్రిక్తంగా మారకుండా ఉండాలనే చిరంజీవి భేటీకి డుమ్మా కొడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X