హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవీందర్ కౌర్, షరీఫ్ ‌లపై కేసుల నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు రవీందర్ కౌర్, అబూ సలే షరీఫ్‌లపై కేసులు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ఆదేశించింది. వివిధ సెక్షన్ల కింద వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెహ్మాన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరంగారావు మీడియాతో చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను ముందే వెల్లడించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. నివేదిక అంశాలను ముందే వెల్లడించి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి చిదంబరానికి నివేదికను సమర్పించిన తర్వాత వారు ఓ మీడియా ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X