హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకు 1956 పూర్వ తెలంగాణ కావాలి: దామోదర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: తమకు 1956 పూర్వ స్థితి కావాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమై చర్చించారు. 1957 పూర్వ స్థితిని పునరుద్ధరించాలనే శ్రీకృష్ణ కమిటీ సిఫార్సును తాము స్వాగతిస్తున్నామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు బుధవారం రాత్రి తమ ప్రాంత ప్రజల అకాంక్షను పార్టీ అధిష్టానానికి చెప్పారని, తమ పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రాంత ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తమ అభిప్రాయాన్ని విన్నవిస్తామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నిరుడు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఉందని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X