హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండురోజులు తెలంగాణ బంద్, రేపు రాజ్‌ భవన్ ముట్టడి: ఓయు జెఏసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికను తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఉస్మానియా ఐక్య కార్యాచరణ సమితి గురువారం విమర్శించింది. కమిటీ చేసిన సిఫార్సులను తాము అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు. అయినా తమకు కమిటీ నివేదికతో పని లేదని తమకు తెలంగాణ ఏర్పాటే ముఖ్యమని ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.

నివేదిక తెలంగాణను అనుకూలంగా లేనందున శుక్రవారం, శనివారం తెలంగాణను బంద్ నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం తెలంగాణలోని విద్యార్థులు పెద్ద ఎత్తున హైదరాబాదుకు తరలి రావాలని కోరారు. రేపు రాజ్ ‌భవన్ ముట్టడిని నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కాగా సిఫార్సులను తాము గుర్తించడం తెలంగాణ జెఏసి చెప్పింది. రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు అలుపెరగకుండా పోరాడుతామని ప్రకటించింది. కాగా నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేదంటూ వరంగల్‌ లోని డిసిసి ఆఫీసుపై కొందరు దాడి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బస్సు అద్దాలు పగులగొట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X