వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది: పురంధేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందని కేంద్ర మంత్రి పురంధేశ్వరి గురువారం విలేకరులతో అన్నారు. తెలంగాణపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ప్రస్తుతం తన నివేదికను మాత్రమే కేంద్రానికి ఇచ్చిందన్నారు. ఇంకా ఫలితం రాలేదన్నారు. ఇప్పుడు ఫలితం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని ఆమె కోరారు.

త్వరలో కేంద్రం ఫలితాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను సంపూర్ణంగా అధ్యయనం చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేస్తుందన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్నీ అన్నారు. నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ తాను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో రాజీ పడనన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుక బడి పోయిందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి తనకు ముఖ్యమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X