హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ పార్టీ ఆధ్యక్షుడిగా జగన్, పత్రాలు సమర్పించిన మాజీ ఎంపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి పెట్టనున్న కొత్త పార్టీ వైయస్ఆర్ పార్టీకి పార్టీ అధ్యక్షుడిగా వైయస్ జగన్మోహన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వైవి భద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వైవి హనుమారెడ్డి, కోశాధికారిగా దామోదర శ్రీనివాస్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శుల పేర్లు ఇస్తు జగన్ ఎన్నికల కమిషన్‌కు పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం చిరునామాను బంజారాహిల్స్‌గా ఇచ్చారు. అరోరా కాలనీ, రెడ్డు నంబర్-3, బంజారాహిల్స్‌, హైదరాబాద్-34 అడ్రస్‌గా ఇచ్చినట్టు తెలుస్తోంది.

కాగా బుధవారం జగన్ పెట్టబోయే కొత్త పార్టీని రిజిస్టర్ చేయించడానికి జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ పేరుకు చోటివ్వకుండా వైయస్ఆర్ పేరు మాత్రమే నమోదు చేశారు. ఆయన న్యాయవాదులతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ జరిగే ఉప ఎన్నికలకు పార్టీ గుర్తుతోనే జగన్ వెళ్లాలని చూస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X