వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా అర్థం చేసుకున్నారు: కాంగ్రెసు సీమాంధ్ర ఎంపీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌ తీర్పుపై తమ ఆవేదనను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అర్థం చేసుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం వారు సోనియాతో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై ప్రధానిని, జలవనరుల మంత్రిని కలవమని సోనియా సూచించారని ఎంపీలు వెల్లడించారు. వారు జల వనరుల శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్‌ను కూడా కలిశారు.

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తాము బన్సల్‌కు చెప్పినట్లు భేటీ అనంతరం కావూరి సాంబశివ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులపై జాప్యం చేయవద్దని కూడా తాము కోరినట్లు ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తిపై బన్సల్ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల ఇప్పటికే తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల అది మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X