ఒయు శాంతిభద్రతలపై అపోహలు ప్రచారం: డిజిపి అరవిందరావు
హైదరాబాదులో ఆరు కేసులు నమోదు చేశామని, జిల్లాల్లో కొన్ని కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. గంపగుత్త మొబైల్ సందేశాలను నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. గంపగుత్త మొబైల్ సందేశాలు పరిస్థితిని విషమింపజేసే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. తాము బుల్లెట్లను వాడడం లేదని, ప్యాలెట్లను మాత్రమే వాడుతున్నామని ఆయన చెప్పారు. బుల్లెట్ గాయాలతో ఎవరూ ఆస్పత్రి పాలు కాలేదని ఆయన చెప్పారు. ఏమో జరిగిపోతోంది, తాము కవర్ చేయడం లేదనే పద్ధతిలో మీడియా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సూరి హత్య కేసులో భాను కిరణ్ పట్టుబడలేదని ఆయన చెప్పారు.
Comments
అరవింద రావు డిజిపి తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ aravind rao dgp telangana osmania university hyderabad
Story first published: Friday, January 7, 2011, 14:52 [IST]