వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై గత వైఖరికి కట్టుబడి ఉన్నాం: షకీల్ అహ్మద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shakeel Ahmad
న్యూఢిల్లీ: తెలంగాణపై తాము గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పారు. మరోసారి రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశం తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మరోసారి నిర్వహించే అఖిల పక్ష సమావేశంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నామని, తెలంగాణపై ఏకాభిప్రాయానికి మరోసారి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అవసరమైతే ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) భాగస్వామ్య పక్షాలను సంప్రదిస్తామని, యుపిఎ తీసుకునే నిర్ణయాన్ని కాంగ్రెసు గౌరవిస్తుందని ఆయన చెప్పారు. మరోసారి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు తర్వాత సముచితమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X