హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒయులో పోలీసు ఘటనలపై తెలంగాణ నేతల గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్‌: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సంఘటనలపై తెలంగాణ రాజకీయ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ఎవరినీ అనుతించడం లేదు. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నారని, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నారని వారంటున్నారు. కానీ విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతోందో ఎవరికీ ఏమీ తెలియడం లేదు. పూర్తిగా పోలీసుల కథనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.

పోలీసులు విద్యార్థులను కొడుతున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. విద్యార్థుల పట్ల మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. విద్యార్థుల పట్ల పోలీసుల తీరును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ కూడా తప్పు పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X