విద్యార్థులపై పోలీసుల దాడిని వెంటనే ఆపాలి: ఎంపీ మంద జగన్నాథం
తెలంగాణ ఉద్యమం కారణంగా చిక్కుల్లో ఇరుక్కు పోయిన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు మంద జగన్నాధం, వివేక్ తదితరులు హోంమంత్రి సబితారెడ్డితో ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేంద్ర బలగాలను మోహరించకూడదని వారు సబితారెడ్డిని కోరారు. వారి డిమాండ్కు సబితారెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో భేటీ తర్వాత పూర్తి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, కేంద్ర బలగాల మోహరింపును వెంటనే వెనక్కు పిలవాలని వారు కోరారు. సంక్రాంతి సెలవుల పేరుతో విద్యార్థులను ఇంటికి పంపించే కుట్రలు పన్నుతున్నారని దానిని అడ్డుకోవాలని కోరారు. మెస్లు తెరవడానికి హోంమంత్రి అంగీకరించినట్టు తెలిపారు. మీడియాను విశ్వవిద్యాలయంలోకి అనుమతించాలని కోరారు. రబ్బరు బుల్టెట్లు, పుల్లెట్లు వాడకూడదని వారు సబితారెడ్డిని కోరారు.