హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో లోయలో బస్సు పడి ఆంధ్ర అయ్యప్ప భక్తులు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
బెంగుళూరు: కర్ణాటకలో ఓ బస్సు లోయలో పడటంతో సికిందరాబాదుకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కారవార జిల్లా ఎల్లాపూర్ దగ్గరలోని హుబ్లీ-గోకర్ణ ఘాట్ రోడ్డులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులోని వారంతా రాజధాని సికిందరాబాదుకు చెందిన వాల్మికీనగర్ వాసులే. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో 40 మంది ఉన్నారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను అయ్యప్ప భక్తులు రామస్వామి, రమేష్, బస్సు డ్రైవర్ అంజిలుగా గుర్తించారు.

అయ్యప్ప భక్తులతో కూడిన బస్సు ఆదివారం సాయంత్రం సికిందరాబాదునుండి బయలు దేరింది. ఈ రోజు కర్ణాటకకు చేరుకుంది. ముందు వెళుతున్న సుమోను బస్సు డ్రైవర్ తప్పించపోయిన పోయాడు. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. సుమోను ఢీకొని వెళ్లి లోయలో పడిపోయింది. ఇద్దరు డ్రైవర్లలో ఒకరు మరణించారు. సమాచారం తెలుసుకున్న కారవార పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. భక్తులను రక్షించే చర్యలు చేపట్టారు. బస్సులోని 27 మందిని ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X