హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడుకు జగన్ ఆస్తులపైనే వైయస్సార్ యావ: టిడిపి నేత బైరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి కుమారుడు వైయస్ జగన్ ఆస్తుల పంపకంపై ఉన్న శ్రద్ధ రాష్టంపై లేదని తెలుగుదేశం నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రాష్టానికి అన్యాయం జరిగే విధంగా రావడానికి వైయస్ కారణమంటూ ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో దుయ్యబట్టారు. తన కుమారుడు వైయస్ జగన్ కోసమే వైయస్సార్ తరుచు ఢిల్లీకి వెళ్లేవారని ఆయన అన్నారు. వైయస్సార్ రాష్ట్రద్రోహిగా మిగిలారని ఆయన వ్యాఖ్యానించారు.

కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదించడానికి పనికి మాలిన, చేతకాని న్యాయవాదులను వైయస్ పంపారని, తన అనుచరులు కాబట్టే వారిని పంపారని ఆయన ఆరోపించారు. ఆ ముగ్గురు న్యాయవాదుల జాబితాను ఆయన మీడియాకు అందజేశారు. వైయస్సార్ రాష్ట్ర హక్కులను కాలరాశారని ఆయన అన్నారు. వైయస్సార్ రాష్ట్రానికి చిప్ప చేతికిచ్చారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు గతంలో వైయస్సార్‌కు రాసిన లేఖను కూడా ఆయన మీడియాకు అందించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై వైయస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X