హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ప్రదీప్ రెడ్డి బినామీయా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabita Indra Reddy
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ మిత్రుడు ప్రదీప్ కుమార్ రెడ్డి బినామీ రాష్ట హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి అని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ ప్రదీప్ రెడ్డి కలిసి విజయవాడలో ఓ సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు తీగల కృష్ణా రెడ్డి, వర్ల రామయ్య సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సూరి హత్య కేసు మరో అయేషా హత్య కేసు అవుతుందని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిపై తాము గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. నైతిక విలువలు ఉంటే సూరి హత్య కేసు పూర్తయ్యే వరకు సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి దూరంగా ఉండాలని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X