వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ వెంట 35 మంది శాసనసభ్యులు, కొత్తగా ఐదుగురు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట 35 మంది శాసనసభ్యులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కొత్తగా ఐదుగురు జగన్‌తో చేరారు. ఢిల్లీలో వైయస్ జగన్ చేపట్టిన జల దీక్షకు 30 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. విజయవాడలో జరిగిన 48 గంటల లక్ష్యదీక్షకు కూడా 30 మంది శాసనసభ్యులే హాజరయ్యారు. లక్ష్యదీక్షకు హాజరైన ఐదుగురు శాసనసభ్యులు జల దీక్షకు రాలేదని చెబుతున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే ఆ ఐదుగురు రాలేదని, వారు జగన్ వెంటే ఉంటారని చెబుతున్నారు. జగన్‌ జలదీక్షకు వచ్చినవారిలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఇద్దరేసి ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి జలదీక్షకు వచ్చారు.

కాగా, సుచరిత, నీరజారెడ్డి వంటి ఐదుగురు కాంగ్రెసు శాసనసభ్యులు కొత్తగా జగన్ శిబిరంలో చేరిపోయారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బద్ధశత్రువైన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి జలదీక్షలో ముందు వరుసలో ఉన్నారు. క్రమక్రమంగా వైయస్ జగన్‌కు శాసనసభ్యుల మద్దతు పెరుగుతోందని అంటున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి వైయస్ జగన్ ముందుకు రావచ్చునని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X