వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వెంట 25మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుసు: వీరప్ప మొయిలీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: ఢిల్లీలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షలో 25 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారనే విషయం తనకూ తెలుసునని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ మంగళవారం హైదరాబాదులో ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. జగన్ వెంట ఉన్న విషయం అధిష్టానానికి తెలుసునని చెప్పారు. వారి విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.

కాగా హైదరాబాదుకు వచ్చిన వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో భేటీ కానున్నారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తారు. జగన్‌ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో అన్నారు. ఆయన వల్ల మాకొచ్చే ప్రమాదమేమీ లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X