వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యంతర ఎన్నికలకే వైయస్ జగన్ ప్లాన్, సబ్బం హరి మాటల ఆంతర్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగే దిశగానే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. మూడేళ్ల దాకా ఆగడానికి ఆయన సిద్ధంగా లేరని అనిపిస్తోంది. జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మాటలు ఈ విషయాన్ని తెలియజేస్తోంది. మధ్యంతర ఎన్నికలకు వైయస్ జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ వెంట 10 -15 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని అనుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెసు అధిష్టానం భావించిందని, అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పరిస్థితి గందరగోళంగా ఉందని, ప్రభుత్వాన్ని కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే 294 శాసనసభా స్థానాలకు వైయస్ జగన్ పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ జలదీక్ష వరకు తాను కాంగ్రెసులోనే ఉంటానని, వైయస్ జగన్ పార్టీ పెట్టగానే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X