వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధ్యంతర ఎన్నికలకే వైయస్ జగన్ ప్లాన్, సబ్బం హరి మాటల ఆంతర్యం
కాంగ్రెసు పరిస్థితి గందరగోళంగా ఉందని, ప్రభుత్వాన్ని కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే 294 శాసనసభా స్థానాలకు వైయస్ జగన్ పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ జలదీక్ష వరకు తాను కాంగ్రెసులోనే ఉంటానని, వైయస్ జగన్ పార్టీ పెట్టగానే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Story first published: Tuesday, January 11, 2011, 9:40 [IST]