హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ సంక్షోభం నేపథ్యంలో మజ్లిస్‌ను దువ్వుతున్న సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిందని వార్తలు వస్తున్ననేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కే పరిమితం అయిన మజ్లిస్ పార్టీని దువ్వుతున్నట్టున్నారు. మజ్లిస్ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ మాటలు చూస్తే ముఖ్యమంత్రి వారిని దువ్వుతున్నట్టే కనిపిస్తోంది. బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంఐఎం పార్టీకి చెందిన ఏడుగురు శాసనసభ్యులు భేటీ ఆయ్యారు. భేటీ అనంతరం అక్బరుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడితే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అంశాన్ని పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని పార్టీ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పాతబస్తీలో పర్యటించాలని కోరినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. పాతబస్తీకి నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు. పాతబస్తీలోని మక్కా మజీదు పేలుళ్లలో అరెస్టు అయిన ముస్లిం విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X