వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధు యాష్కీపై గుర్రుమంటున్న శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు దుగ్గల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

VK Duggal
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై వచ్చిన వార్తలను ఆ కమిటీ సభ్యుడు వికె దుగ్గల్ ఖండించారు. అయితే ఈ విషయంపై తాను మీడియాతో మాట్లాడదల్చుకోలేదన్నారు. నిజామాబాద్ పార్లమంటు సభ్యుడు మధుయాష్కీ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సీమాంధ్రుల నుండి ముడుపులు తీసుకున్నారని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా దానిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

కాగా మధుయాష్కీతో పాటు పలువురు తెలంగాణవాదులు శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీమాంధ్రులతో పలుమార్లు భేటీ ఆయిన శ్రీకృష్ణ సభ్యులు వారికి అమ్ముడు పోయారని వ్యాఖ్యలు చేశారు. మరికొందరు వారిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా నివేదిక విడుదలకు ముందే వారు సీమాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నాంపల్లి కోర్టు దృష్టికి తెలంగాణవాదులు తీసుకు రావడంతో కమిటీ సభ్యుల ఇద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X