విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ హోటల్లో హైదరాబాద్ మహిళ దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: విజయవాడలోని ఓ హోటల్లో మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. విజయవాడలోని అభిరామ్ హోటల్లో లూసీ అనే మహిళ హత్యకు గురైంది. ఆమెతో పాటు హోటల్ గది తీసుకున్న రాజు ఆచూకీ తెలియడం లేదు. అతను పారిపోయాడని అనుమానిస్తున్నారు. రాజు, లూసీ ఈ నెల 10వ తేదీన విజయవాడలోని అభిరామ్ హోటల్లో గది తీసుకున్నారు. తమను భార్యాభర్తలుగా చెప్పుకున్నారు. తాము హైదరాబాద్ నుంచి వచ్చినట్లు హోటల్ రిజిష్టర్ ‌లో నమోదు చేశారు. పూర్తి చిరునామా మాత్రం ఇవ్వలేదు.

గదికి తాళం వేసి ఉంది. తాళం చెవి వారు తమ వెంట తీసుకుపోయి ఉంటారని హోటల్ సిబ్బంది భావించారు. అయితే, గదిలోంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గది తలుపులు తీయగా లూసీ శవం ఓ తాడుకు వేలాడుతూ కనిపించింది. ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని తెలుస్తోంది. రాజు ఆచూకీ మాత్రం తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X