హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమయం వచ్చినప్పుడు తెలంగాణపై మాట్లాడ్తా: మర్రి శశిధర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Marri Sashidhar Reddy
హైదరాబాద్: సమయం వచ్చినప్పుడు తెలంగాణపై మాట్లాడుతానని జాతీయ విపత్తుల నిర్వహణ సంఘం చైర్మన్, కాంగ్రెసు శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణ సహా కృష్ణాడెల్టాకు అన్యాయం జరుగుతుందని గతంలోనే తాను, పీజేఆర్‌ ఎన్నోమార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకువెళ్లేందుకు కనీసం ఓ విధానం ఉండాలని తాము పదేపదే పట్టుబట్టామని వెల్లడించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికను అధ్యయనం చేయాల్సి ఉందని, కమిటీ కూడా పోతిరెడ్డిపాడు అంశాన్ని ప్రస్తావించిందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, జగన్‌ వెంట వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. రాజధాని మంచి నీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణ మూడో దశ కావాల్సిందేనని శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాల కోసం రూ. 600 కోట్లతో పైపులు మాత్రమే వేశారని, కృష్ణ మూడో దశ తప్ప మరోమార్గం లేదని స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X