వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ సాక్షి చానెల్‌పై వీరప్ప మొయిలీ మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మారుస్తారంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల లోగా కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి తెలంగాణ నేతల్లో ఒకరికి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారంటూ సాక్షి టీవీ చానెల్ గురువారం పెద్ద యెత్తున వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.

ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లలో మంత్రి కె. జానా రెడ్డి పేరు కూడా ఉంది. ఇదే వార్తాకథనాన్ని దాదాపు మక్కీకి మక్కీగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ సిఇవోగా ఉన్న స్టూడియోఎన్ చానెల్ కూడా ప్రసారం చేసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది.

ఆ వార్తాకథనంపై మొయిలీ గురువారం సాయంత్రం స్పందించారు. రాష్ట్ర రాజకీయాలపై తమకు పూర్తి అవగాహన ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర రాజకీయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. ఇటు హైదరాబాదులో మంత్రి జానా రెడ్డి ఈ వార్తాకథనం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆ వార్తాకథనాన్ని ఎందుకు ప్రసారం చేశారో తెలుసునని భేటీ అనంతరం జానా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి మార్పు వార్తను ఆయన ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X