వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు, రాజకీయ సినీ ప్రముఖులు హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

cocks competition
కాకినాడ: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ పందేలకు పెద్ద యెత్తున రాజకీయ, సినీ ప్రముఖులు తరలి వచ్చారు. దాదాపు 30 మంది శాసనసభ్యులు పందేలకు హాజరైనట్లు సమాచారం. ప్రవాసాంధ్రులు కూడా పెద్ద యెత్తున వచ్చారు. కోట్లాది రూపాయలు పందేల్లో చేతులు మారుతున్నాయి. కోడి పందేలపై నిషేధం ఉన్నప్పటికీ పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కోడి పందేలపై చర్యలు తీసుకోవద్దని శానససభ్యులు పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో యధేచ్ఛగా పందేలు జరుగుతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు నెలలకు ముందే లాడ్జీలు మొత్తం బుక్కయ్యాయి. దాదాపు 200 కోట్ల రూపాయలు పందేల్లో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. కోడి పందేల్లో ఎకరాలకు ఎకరాలకు పందేలు కాయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు కాయడం సంప్రదాయంగా వస్తోంది. కోడి పందేలు కాసే వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం కనిపించడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X