వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి చీఫ్‌గా డిఎస్ కొనసాగింపు, ఎఐసిసి అధికారిక ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
న్యూఢిల్లీ‌: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్‌ను కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించింది. మూడవసారి పీసీసీ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్‌ను నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికి రెండుసార్లు ఆయన ఈ పదవిలో ఉన్నందున ఈసారి ఆయనను మార్చటం ఖాయమని ప్రచారం జరిగింది. కేవీపీ, సురేష్‌రెడ్డి తదితరుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే పార్టీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితి దృష్ట్యా అనుభవం ఉన్న డీఎస్‌నే కొనసాగించటం మేలని అధిష్టానం అభిప్రాయపడింది. తెలంగాణకు చెందినవాడు కావటం కూడా డీఎస్‌కు కలిసి వచ్చింది.

ముఖ్యమంత్రి సీమాంధ్రకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి కావడం వల్ల తెలంగాణ నాయకుడిని పిసిసి పదవిలో నియమించడం అవసరంగా మారింది. దీంతో తెలంగాణ నుంచి డిఎస్‌ను మించిన నాయకుడు ఎఐసిసికి కనిపించలేదని భావించాల్సి ఉంటుంది. సీమాంధ్ర నాయకులకు కూడా డిఎస్ ఆమోదయోగ్యం కావడం అందుకు ప్రధాన కారణం. దానికితోడు, పార్టీని సమన్వయం చేయడంలో డిఎస్‌ పాత్ర గణనీయమైందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X