హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి, భాను స్థావరాలపై మధు సహాయంతో పోలీసుల దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: హత్యకు గురైన మద్దెలచెర్వు సూరి, హత్య కేసులో ప్రధాని నిందితుడు భాను కిరణ్ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సూరి ముఖ్య అనుచరుడు మధుసూదన్ రెడ్డి సాయంతో పోలీసులు వారిద్దరి స్థావరాలను కనిపెట్టి, కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సూరి హత్య జరిగిననాటి నుంచి మధు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. హైదరాబాదులోని రెండు స్థావరాలను మధు పోలీసులకు చూపించినట్లు తెలుస్తోంది.

కాగా, మధును వెంట పెట్టుకుని పోలీసులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భాను, సూరిల స్థావరాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బెంగళూర్, రాయచూర్, బీదర్, కడప, అనంతపురం, పాణ్యంల్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సూరి, భానుల మధ్య జరిగిన సంభాషణలను కూడా పోలీసులు రికార్డు చేసినట్లు చెబుతున్నారు. మధును పోలీసులు నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే, సినీ నిర్మాత సి. కళ్యాణ్‌ను పోలీసులు శుక్రవారం మరోసారి ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X