కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సీమాంధ్ర నాయకులతో చర్చలు: పొన్నం ప్రభాకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Ponnam Prabhakar
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై సీమాంధ్ర నాయకులతో చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందనే నమ్మకం ఉందని ఆయన శుక్రవారం చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పే ప్రక్రియ సాగుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని, అందుకు ఏ త్యాగాలకైనా తాము సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణవారికి మంత్రి పదవులు లభిస్తే తెలంగాణ కోసం పోరాడడానికి మరింత బలం చేకూరుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల తెలంగాణ సమస్య పరిష్కారం కాదని ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణ రావు అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీలో అనిశ్చితి నెలకొందని ఆయన అన్నారు. గవర్నర్ జోక్యం మంచిది కాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర నాయకులు డబ్బులిచ్చారని ఆరోపణ చేయడం తగదని ఆయన అన్నారు. పొన్నం ప్రభాకర్ లాంటివారు తెలంగాణ సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X