హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ సభ్యులు సీమాంధ్ర ఎంపీలతో జల్సా చేసి నివేదిక ఇచ్చారు: ఎంపీ వివేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vivek
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో జల్సా చేసి తప్పుడు నివేదిక ఇచ్చారని ఎంపీ వివేక్ ఆదివారం తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం సమావేశం అనంతరం మాట్లాడుతూ ఆరోపించారు.గతంలో మేం చెప్పినట్లుగానే జరిగిందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై గతంలోనే మేం అనుమానం వ్యక్తం చేశామని చెప్పారు. తాము ఇంతకుముందు చెప్పినట్టుగా పదవుల విషయంలో కట్టుబడి ఉన్నామన్నారు. తాము పదవులు తీసుకోమని చెప్పారు. అయితే సీనియర్ ఎంపీలు పదవులు తీసుకోవటంలో తప్పులేదని భావిస్తున్నామని చెప్పారు.

వారు పదవులు తీసుకున్నప్పటికీ తెలంగాణ కోసం అందరితో కలిసి పోరాడుతారని చెప్పారు. పదవులు తీసుకున్నా తీసుకోకపోయినా తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కట్టుబడి ఉన్నారని చెప్పారు. కాగా తాము జెఏసిలో ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం అందరితో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో చెప్పినట్టుగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. సోమవారం జెఏసి ఆధ్వర్యంలోని రహదారుల నిర్భందానికి మద్దతు ఇస్తే తప్పులేదని తాము భావిస్తున్నామన్నారు. అయితే పార్టీలో చర్చించిన తర్వాత మద్దతు విషయం ప్రకటిస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X