వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు జైలు శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhusudan Gupta
కర్నూలు: కర్నూలు జిల్లా గుంతకల్ శాసనసభ్యుడు మధుసూదన్ గుప్తాకు స్థానిక కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు 60 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. గుప్తాకు చెందిన ఓ స్టీల్ ఫ్యాక్టరీలో 2006 జూలైలో గ్యాస్ లీకయి ముగ్గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారణ సాగింది. చివరకు ఎమ్మెల్యేకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

ఫ్యాక్టరీ మేనేజర్ దేవరాజుకు కోర్టు మూడు నెలల జైలు శిక్ష, 60 వేల రూపాయల జరిమానా విధించింది. జిల్లా కోర్టుకు అపీల్ చేసుకునేందుకు శాసనసభ్యుడికి స్థానిక కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు మధుసూదన్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. అయితే, మధుసూదన్ గుప్తా మీడియాకు అందుబాటులో లేరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X