సిఎంతో జగన్ వర్గం ఎమ్మెల్యే భేటీ!:దీక్షపై వివరణ ఇచ్చే ఛాన్స్
జగన్ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై కాంగ్రెసు అధిష్టానంతో ఉన్న నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పాల్గొన్న నేతలపై అధిష్టానం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ప్రకటించారు. ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీ తదితరులు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖపై, టిడిపి అసమ్మతి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె అధిష్టానం తనపై చర్యలకు ముందుగానే ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేందుకే కలుస్తున్నట్టుగా తెలుస్తోంది.
Comments
సుచరిత వైయస్ జగన్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్ sucharitha ys jagan kiran kumar reddy congress hyderabad
Story first published: Monday, January 17, 2011, 15:35 [IST]