హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను కిరణ్ ‌తో సింగనమల రమేష్ లింక్స్: ఏడున్నర కోట్ల వివాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Singamala Ramesh
హైదరాబాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో తెలుగు సినీ నిర్మాత సింగనమల రమేష్ సంబంధాలు బట్టబయలు అయ్యాయి. తొలుత నిర్మాత జయంతిరెడ్డిగా భావించిన సినీ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి ఫిర్యాదుతో భానుతో రమేష్ సంబంధాలు మరింతగా వెలుగులోకి వచ్చినట్లయింది. వైజయంతి రెడ్డి ఫిర్యాదు ప్రకారం - సింగనమల రమేష్ వైజయంతిరెడ్డి వద్ద 7.62 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అందుకు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో గల భూమిని కుదువపెట్టాడు. ఈ వ్యవహారం 2008లో నడిచింది.

వైజయంతి రెడ్డి అప్పును సింగనమల రమేష్ చెల్లించలేదు. దాంతో మహేశ్వరంలోని భూమిని రిజస్టేషన్ చేస్తానని రమేష్ హామీ ఇచ్చాడు. ఎన్ని సార్లు అడిగినా రిజిస్ట్రేషన్ చేయలేదు. 2009లో భానుతో కలిసి సింగనమల రమేష్ వైజయంతిరెడ్డిని బెదిరించాడు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. దీంతో వైజయంతి రెడ్డి వెనక్కి తగ్గారు. ఇప్పుడు సూరి హత్య తర్వాత భాను కిరణ్ కోసం పోలీసులు వెతుకున్న స్థితిలో వైజయంతి రెడ్డి సిసిఎస్ పోలీసులకు సింగనమల రమేష్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X