విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ సిపిగా అమిత్ గార్గ్: పది మంది ఐపియస్‌ల బదిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
హైదరాబాద్: రాష్ట్రంలో పది మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించి, బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ (సీపీ)గా అమిత్ ‌గార్గ్, హైదరాబాద్ రేంజ్ డీఐజీగా నాగిరెడ్డి, జాయింట్ సీపీగా మదుసూధన్‌రెడ్డిని నియమించింది. మహిళలను లైంగిక వేధించిన ఆరోపణల్లో విజయవాడ సిపిగా ఉన్న సీతారామాంజనేయులును బదిలీ చేసిన విషయం తెలిసిందే. సీతారామాంజనేయులును ఇప్పటికే గ్రేహౌండ్స్‌లో వేశారు.

మిగతా ఐపియస్ అధికారులు ఇలా నియమితులయ్యారు - విజయకుమార్ - డీఐజీ - సెంట్రల్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ), అతుల్ సింగ్ - డీఐజీ - రైల్వే, స్వాతీ లక్రా - జాయింట్ కమిషనర్ - సైబరాబాద్ ఎస్. సూర్యనారాయణ - ఏసీబీ - జాయింట్ డైరెక్టర్, సంజయ్ ‌కుమార్ జైన్ - డీఐజీ - కరీంనగర్‌జిల్లా, డి.ఎస్. చౌమాన్ - డీఐజీ - వరంగల్ జిల్లా, భావనా సక్సెనా - డీఐజీ - విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X