కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ ‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Katasani Rambhupal Reddy
కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రామ్ భూపాల్‌రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడి దిశలో అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీని వీడి మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి పెట్టే పార్టీలో చేరేందుకు అడుగులు వేస్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం తన నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెసు పార్టీలో ఉండాలా, జగన్ వైపు వెళ్లాలా అనే విషయంలో వారి అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఆయన సమావేశమయ్యారు. ఆయన కార్యకర్తల్లో మెజార్టీ జగన్ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. జగన్ వైపు వెళితేనే భవిష్యత్తు ఉంటుందని ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా జగన్‌కు మద్దతు పలికినట్టు సమాచారం. కార్యకర్తలతో పాటు కాటసాని కూడా కాంగ్రెసు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీలో ఉన్న కాటసాని మంత్రివర్గంలో తనకు చోటు లభించని కారణంగా జగన్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాను ముప్పయ్యేళ్లనుండి పార్టీలో ఉన్నానని ఆయన ఇదివరకే చెప్పారు. మంత్రివర్గంలో తనకు చోటు లభించనందుకు అసంతృప్తితో ఉన్నట్టు ఆయన అప్పుడే చెప్పారు. తన అనుభవాన్ని ముఖ్యమంత్రి కిరణ్ లెక్కలోకి తీసుకోలేదని ఆయన ఆవేదన చెందారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగుండేదని చెప్పారు. కాంగ్రెసు‌లో ఉండాలా, జగన్ వైపు వెళ్లాలా ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు. ఆయన కుమార్తె పెళ్లికి జగన్ వచ్చినప్పుడే ఆయన కాంగ్రెసు వీడతారనే వార్తలు కూడా వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X