హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రచ్చబండతో ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gutta Sukender Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24నుండి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ వాయిదా వేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి బుధవారం అన్నారు. ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో నిర్వహించడం వల్ల తెలంగాణవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌లో తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి ఆ తర్వాత వెనకడుగు వేసినందున తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించే వరకు ముఖ్యమంత్రి తన రచ్చబండ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. లేకుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ నిర్మాణాన్ని తాము అడ్డుకుని తీరుతామని ఆయన ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X