హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో బాంబు కలకలం: ఆకతాయి పనిగా తేల్చిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులో మరోసారి బాంబు కలకలం చెలరేగింది. హైదరాబాదులోని లక్డీకాపూల్‌లో ఓ అగంతకుడు ఈ చర్యకు పూనుకున్నాడు. కోటేశ్వరరావు అనే ఓ వ్యక్తి హైదరాబాదునుండి విజయవాడకు తన సఫారీకారులో వెళుతున్నారు. ఆయన లకిడీకాపూల్ వరకు రాగానే ఓ గుర్తు తెలియని వ్యక్తి టూవీలర్‌పై వచ్చి కోటేశ్వరరావుకు ఓ ప్లాస్టిక్ గిఫ్ట్ ప్యాక్ ఇస్తూ సార్ మీరు నాకు తెలుసు. నీవల్ల నాకు ప్రయోజనం కలిగింది. ఈ గిఫ్ట్ ఉంచండంటూ ఆయన కారులో పడేసి వెళ్లిపోయాడు. కోటేశ్వరరావు ఆ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేసి చూడగా అందులో సెల్‌ఫోన్‌ను పోలిన ఓ వస్తువు కనిపించింది. అయితే అనుమానం వచ్చిన కోటేశ్వరరావు దానిని కారునుండి బయటకు తీసుకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దానిని చూసి బాంబుగానే భ్రమపడ్డారు. అయితే దానిని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం అది బాంబు కాదని తేల్చారు. ఎవరో ఆకతాయి చేష్టలుగా చెప్పారు. అయితే ఇలాంటి ఆకతాయిలు బంజారాహిల్సు, జూబ్లీహిల్సు పరిధిలో కొందరని భయానికి గురి చేస్తున్నారు. ఇటీవలే మొహిదీపట్నంలో ఓ అగంతకుడు ఇలాంటి దుశ్చర్యకు పూనుకున్నాడు. అయితే పోలీసులు ఇలాంటి ఆకతాయిల అటకట్టిస్తామని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X