విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో ముందుగానే బెట్టింగులు: 7గురిని అరెస్టు చేసిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: ప్రపంచ కప్ ఇంకా నెలరోజులు ఉండగానే రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. రాజకీయ రాజధాని విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగుకు పాల్పడుతున్న వ్యక్తులతో పాటు 10 సెల్‌ఫోన్లు, ఒక లాప్‌టాప్, భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం తీసుకున్నారు. అయితే బెట్టింగుకు పాల్పడుతున్న వారు నివాస గృహాల మధ్యనే బెట్టింగులకు పాల్పడటం విశేషం.

ప్రపంచకప్ ‌తో పాటు ప్రస్తుతం నడుస్తున్న భారత్-దక్షిణాఫ్రికా, పాకిస్తాన్-న్యూజిలాండ్ దేశాల మధ్య జరుగుతున్న వన్డేలపై కూడా జోరుగు బెట్టింగులు నడుస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వన్డేలపై, ప్రపంచకప్‌‌పై బెట్టింగులు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే విజయవాడ హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగుళూరు వంటి పలు నగరాలకు కేంద్రంగా ఉండటంతో బెట్టింగులు బెజవాడలో జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X