హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధిష్టానాలను ధిక్కరించండి: టిడిపి, కాంగ్రెసు నేతలకు ఈటెల సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్: కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ పార్టీల అధిష్టానాన్ని ధిక్కరించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిడిపి, కాంగ్రెసు పార్టీ వారు అందరితో కలిసి రాకపోతే గ్రామాలలో అడుగు పెట్టనివ్వరని హెచ్చరించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం పదవుల పేరుతో ప్రజాప్రతినిధులను ప్రలోభ పెడుతుందని ఆరోపించారు. అలాంటి వాటికి నేతలు లొంగితే తెలంగాణలో వారికి రాజకీయ జీవితం ఉండదన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ ‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో నిర్వహించాలని చూస్తున్న రచ్చబండ కార్యక్రమానికి తెలంగాణలో భంగపాటు ఎదురుకాక తప్పదని అన్నారు. రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో ప్రజలందరూ అడ్డుకుంటారని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X