వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి పెట్రో మంటలు, తీవ్ర ఆసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి ప్రధాని మన్మోహన్ సింగ్ పెట్రోల్ మంట పెట్టారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖకు మార్చారు. ఇంత వరకు ఆ శాఖను మురళిదేవరా నిర్వహిస్తున్నారు. నెలలో రెండు సార్లు పెట్రోల్ ధర పెంచిన నేపథ్యంలో పెట్రోలియం శాఖను నిర్వహించడం వల్ల తన ఇమేజ్ దెబ్బ తింటుందని జైపాల్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా, దాన్ని నిర్వహించడం తప్ప ఆయనకు మరో మార్గం లేదు. పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ శాఖను నిర్వహించడం ఆందోళనకరంగానే ఉందని జైపాల్ రెడ్డి స్వయంగా మీడియాతో అన్నారు.

కాగా, కామన్ ‌వెల్త్ క్రీడల్లో అవినీతి చోటు చేసుకోవడం వల్లనే జైపాల్ రెడ్డిని పట్టణాభివృద్ధి శాఖ నుంచి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. కామన్‌వెల్త్ క్రీడల్లో అవినీతి వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టపై నీలినీడలు అలుముకున్నాయి. పైగా, తెలంగాణ అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెసు అధిష్టానాన్ని గుదిబండలా చుట్టుకుంది. తెలంగాణపై తాను తటస్థ వైఖరితో ఉన్నట్లు జైపాల్ రెడ్డి సోనియా గాంధీకి చెప్పుకున్నారని సమాచారం. దానివల్ల ఆ మాత్రం ప్రాధాన్యమైనా జైపాల్ రెడ్డికి దక్కిందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X