వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై చర్చకు ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. సిఎం ఢిల్లీ పర్యటనలో వైఎస్ జగన్ అంశంతో పాటు ప్రధానంగా తెలంగాణ అంశంపై చర్చలు సాగనున్నాయని తెలుస్తోంది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చిదంబరంతో భేటీ, 11.30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో, సాయంత్రం 6 గంటలకు రైల్వే శాఖమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతారు. మమతతో భేటీలో రైల్వే కోటాలో రాష్ట్రానికి ప్రత్యేక వాటా విషయమై చర్చిస్తారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొంటారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సిఎం ఢిల్లీ పర్యటన తెలంగాణ అంశంపై అంతిమ నిర్ణయానికే అని సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఎంపీలతో కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ రెండుసార్లు భేటీ అయ్యారు. గురువారం సీమాంధ్ర ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. రెండు ప్రాంతాల వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆఖరుగా ముఖ్యమంత్రితో రాష్ట్ర పరిస్థితిపై చర్చించిన తర్వాత తెలంగాణ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రజారాజ్యం పార్టీతో సత్సంబంధాలు నెరపుతున్న విషయంపై కూడా అధిష్టానానికి ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. జగన్ ఎఫెక్టును ఎలాగైనా ఎదుర్కొవచ్చునని, తెలంగాణపైనే ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X