వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన యువనేత జగన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

YS Jagan
అనకాపల్లి: రైతు గోడు వినాలని ఢిల్లీ వెళ్లి దీక్ష చేసినా..వినేందుకు..కనీసం చూసేందుకు కూడా ప్రధాన మంత్రికి ఐదు నిమిషాలు తీరిక లేదని యువనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మన రాష్ట్రం ఎడారవుతుంటే పట్టని కాంగ్రెస్ పార్టీకి మనం ఎంపీలను ఎందుకు ఇవ్వాలంటూ నిప్పులు చెరిగారు. విశాఖ జిల్లా ఓదార్పులో భాగంగా గురువారం సాయంత్రం అనకాపల్లిలో, రాత్రి పరవాడలో వైయస్సార్ విగ్రహావిష్కరణల అనంతరం భారీ జనవాహినిని ఉద్దేశించి ఆయన ఆవేశంగా ప్రసంగించారు.

'దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఏం జరుగుతోందో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం ఎటు పోతుందో చూడండి. మనం ఎక్కడున్నామో చూడండి. రైతన్న పరిస్థితి ఎలా ఉందో చూడండి. పేదవాడి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసే నాథుడే లేడా? రైతన్నపై దెబ్బమీద దెబ్బ పడుతోందని ఢిల్లీకి వెళ్లి అపాయింట్‌మెంట్ అడిగితే కనీసం ఐదు నిమిషాల సమయం కూడా దొరకని పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు అన్యాయంగా ఉందని, రాష్ట్రం ఎడారిలా మారుతోందని, భారీగా నష్టం వాటిల్లనుందని.. ఇది వివరించేందుకు ఒక్క ఐదు నిమిషాలు అపాయింట్‌మెంట్ కోరితే ప్రధానమంత్రికి తీరిక లేదు.

33 మంది ఎంపీలను వైయస్ ఢిల్లీకి పంపితే ఇదా మన దుస్థితి?" అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రానికి ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి ఇంత మంది ఎంపీలను మనం ఎందుకివ్వాలని జగన్ ప్రశ్నించారు. 'ఒక్క రైలు కావాలన్నా, రైలు రూటు కావాలన్నా మమతా బెనర్జీ దగ్గరికి పోవాలి. ఆవిడేమో పశ్చిమ బెంగాల్‌కో, కోల్‌కతాకో ఇస్తారు. అంతకుముందు రైల్వే మంత్రిగా లాలూప్రసాద్ ఉంటే.. ఆయనేమో బీహార్‌కు పంపుకొంటారు. చివరికి వ్యవసాయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకొందామంటే.. ఆ శాఖ మంత్రేమో మహారాష్టక్రు చెందినవారు. మరి మన రాష్ట్రం నుంచి ఎంపీలను ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి ఎందుకివ్వాలి?" అని ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X