హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని రాజీనామా చేయాలి: హైదరాబాద్ ధర్నాలో చంద్రబాబు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: నిత్యావసర సరుకుల ధరలు తగ్గించలేని ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు నియంత్రించలేని వారికి దేశాన్ని పాలించే అర్హత లేదని ఆయన అన్నారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఇందిరాపార్క్‌ వద్ద ఆయన శనివారం మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బు వ్యామోహం పట్టుకుందని విచ్చలవిడి అవినీతి వల్లే ధరలు ఆకాశాన్నంటాయని ఆయన అన్నారు.

2004 వరకు ఏ పన్నులైతే ఉన్నాయో వాటినే ఇప్పుడు అమలు చేస్తే ధరలు అదుపులోకి వస్తాయని తక్షణం దానికి కార్యాచరణ ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ధరల నియంత్రణ చేతగాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజనామా చేయాలన్నారు. పేదలకు మాయమాటలు చెప్పి వైఎస్‌ లక్షల కోట్టు దోచుకున్నారన్నారు. పెట్రో ధరలు నియంత్రించే వరకూ పోరాటం ఆగదన్న చంద్రబాబు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంతకు ముందు చంద్రబాబు సికింద్రాబాదులోని మోండా మార్కెట్‌లో వ్యాపారులను, నినియోగదారులను కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సైకిల్ యాత్ర చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X