హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రచ్చబండ రచ్చరచ్చ: మంత్రులకు తెలంగాణ సెగ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణలోని జిల్లాల్లో మంత్రులు చేపట్టిన రచ్చబండ సమీక్షాసమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. తెలంగాణవాదుల నుంచి వివిధ జిల్లాల్లో మంత్రులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు. వారిని తెలంగాణ సెగ తాకుతోంది. మెదక్ జిల్లా సంగారెడ్డిలో మంత్రి దానం నాగేందర్‌కు తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆయనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తెలంగాణవాదులపై శాసనసభ్యుడు జగ్గారెడ్డి రెచ్చిపోయారు. ఆయన ఆందోళనకారులపై చేయి కూడా చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రంగారెడ్డి జిల్లా కాప్రాలో మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణవాదుల నుంచి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆయనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయాలని వారు మంత్రులను డిమాండ్ చేశారు. కాగా, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం నుంచి ఆయనను బయటకు రానీయలేదు. వరంగల్‌లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ తెలంగాణవాదుల వ్యతిరేకతను ఎదుర్కున్నారు. వారి కాన్వాయ్‌ని వారు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X