జై బోలో తెలంగాణ అడ్డుకోవద్దంటూ సెన్సారు బోర్డు ఎదుట జెఏసి ధర్నా
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన జైభోలో తెలంగాణ చిత్రం ఎవరికీ వ్యతిరేకం కాదని ఆ చిత్ర దర్శకుడు శంకర్ స్పష్టం చేశారు. ఏ ఒక్క ప్రాంతాన్నో వ్యతిరేకిస్తూ చిత్రాన్ని తీయలేదని చెప్పారు. తెలంగాణ చరిత్ర నేపథ్యంలో మాత్రమే తీసిన చిత్రమని చెప్పారు. చిత్రాన్ని ఎవరూ కూడా అడ్డుకోకూడదని ఆయన కోరారు. కాగా సోమవారం చిత్రాన్ని చూసిన సెన్సారు బోర్డులోని నలుగురిలో ముగ్గురు చిత్రం విడుదలకు ఆమోదం తెలుపగా, ఒక సభ్యురాలు మాత్రం విడుదలకు నో చెప్పారు. దీంతో దర్శకులు శంకర్ మంగళవారం ఉదయం నుండి సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. సాయంత్రం వరకు చర్చలు జరిగే అవకాశముంది. ఈ చర్చలు విఫలమైతే రివైండ్ కమిటీని ఆశ్రయించే అవకాశం ఉంది.
Comments
Story first published: Tuesday, January 25, 2011, 15:56 [IST]