హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో మలుపు తిరిగిన సూరి హత్య కేసు: ఆర్థిక లావాదేవీలే కారణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ అనుచరులు సుబ్బయ్య, మన్మోహన్‌లను పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరిని మహారాష్ట్రలో అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. వారి విచారణలో కొత్త విషయాలు తెలిసినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీల కారణంగానే సూరిని భాను హత్య చేశాడని, ఇందులో ఏ విధమైన కుట్ర లేదని విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.

సూరిని హత్య చేసిన తర్వాత మన్మోహన్, సుబ్బయ్యలతో కలిసి భాను పూణే వైపు బయలుదేరాడు. మధ్యలో సుబ్బయ్యను వదిలేశారు. ఆ తర్వాత మన్మోహన్‌ను వదిలేసి భాను కిరణ్ వెళ్లిపోయాడు. భాను కిరణ్‌ తనతో ఉన్నంత సేపు సూరి హత్య గురించి తనకు తెలియదని భాను గన్‌మన్‌గా వ్యవహరిస్తున్న మన్మోహన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X