హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలోనే వచ్చే రిపబ్లిక్ వేడుకలు: నాయిని నరసింహారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Naini Narasimha Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటానికి కేంద్రం అయిన తెలంగాణ భవన్‌పై కన్నుపడితే మసి అవుతారని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లను తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం హెచ్చరించారు. కులమతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం జరుగుతుందన్నారు. అయితే కొందరు మాత్రం ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కులమతాలకు అతీతంగా ఉద్యమం చేస్తుంటే కులం కార్డును ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

రచ్చబండ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అన్నారు. కాబట్టే దానిని అడ్డుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. అది ఏ పార్టీకో సంబంధించిన కార్యక్రమం కాదన్నారు. రాబోయే గణతంత్ర వేడుకలను తెలంగాణలోనే జరుపుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X