వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ డబ్బుతో కొవ్వెక్కి దీక్షలు: జగన్‌ పై గాలి ముద్దుకృష్ణమ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddu krishnama Naidu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించడాని, ఆ డబ్బుతో కొవ్వుపట్టి లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్ష అంటూ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు బుధవారం తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ఎప్పుడు పెడతారో జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అంతగా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కోరిక ఉంటే తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు కదా అని సూచించారు.

జగన్ ఆస్తులపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు స్పందించటం లేదన్నారు. ఆయన ఆస్తులపై విచారణ చేయించకపోవడానికి గల కారణాలు ఏమిటో ప్రజలకు తెలియాలన్నారు. ఆయన అక్రమ ఆస్తులలో సోనియాకు వాటా ఉందని అందరూ భావిస్తున్నారన్నారు. ఆ కారణంగానే ఆమె జగన్‌పై విచారణ చేయించలేక పోతుందని అనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, జగన్ ఇద్దరూ ఇద్దరే అని విమర్శించారు. జగన్, కాంగ్రెస్ నిత్యం టిడిపిపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.

కాగా ప్రభుత్వం మాజీ ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రారావుపై వెంటనే స్పందించాలని టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో అన్నారు. కెవిపి దుబాయ్‌లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఆయనను రప్పించాలన్నారు. ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలన్నారు. కెవిపి ఆస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X