హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్దెలచెర్వు సూరి హత్యకు రెండు నెలల ముందే భాను స్కెచ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddelachervu Suri
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్యకు రెండు నెలల ముందే భాను కిరణ్ స్కెచ్ వేశాడని ప్రచారం జరుగుతోంది. భాను కిరణ్ గన్‌మన్ మన్మోహన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు భాను తమకు చెప్పాడని, కానీ ఆ ఆపరేషన్ సూరిని చంపడానికేనని తమకు తెలియదని మన్మోహన్ పోలీసు విచారణలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల కారణంగానే భాను కిరణ్ సూరిని హత్య చేసినట్లు అతని మాటలను బట్టి తెలుస్తోందని అంటున్నారు. పోలీసులు మన్మోహన్, సుబ్బయ్యలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

హత్య జరిగినప్పుడు భాను కిరణ్, మన్మోహన్ కూడా సూరి మృతదేహంతో అపోలో ఆస్పత్రి దాకా వచ్చారని, అన్నను చంపారంటూ అరిచారని, ఎవరో అభిమానులు అనుకున్నారు తప్ప భాను, మన్మోహన్ అని గుర్తించలేకపోయారని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో వార్తాకథనం వచ్చింది. అపోలో ఆస్పత్రి నుంచి కూకట్‌పల్లి వెళ్లి అక్కడి నుంచి వారిద్దరు సుబ్బయ్యతో కలిసి గుర్గావ్ పారిపోయినట్లు చెబుతున్నారు.

మన్మోహన్, సుబ్బయ్యలను కూడా హతమార్చేందుకు భాను సిద్ధపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మన్మోహన్‌ను భాను ఓ గదిలో బంధించాడని, అతని భార్య న్యాయవాది శ్రీకాంత్ గౌడ్‌కు ఫోన్ చేయడంతో సమాచారం పోలీసులకు చేరిందని, దాంతో మన్మోహన్‌ ఆచూకీని పోలీసులు కనిపెట్టారని అంటున్నారు. సూరి హత్య కేసులో ఆధారాలను పరిశీలిస్తున్నామని డిజిపి అరవింద రావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X