భాను కిరణ్ మధురలో అరెస్టయ్యాడా, లొంగిపోవడానికి సిద్ధపడ్డాడా?
కాగా, సుబ్బయ్య, మన్మోహన్లను వెంట పెట్టుకుని భాను కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, మధుర ప్రాంతాల్లో నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు పరిచయం ఉన్న పోలీసుల ద్వారా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు భాను సంకేతాలు పంపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తన కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెరుగుతుండడంతో భాను లొంగిపోవడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.
భాను కిరణ్ వద్ద సూరి హత్య తర్వాత 50 లక్షల రూపాయలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డబ్బులతో అతను పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు చెబుతున్నారు. చాలా సేపు ఒక చోట ఉండకుండా వాహనాలు అద్దెకు తీసుకుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Thursday, January 27, 2011, 14:10 [IST]